73వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు కువైట్లో ఘనంగా జరిగాయి. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. కువైట్లో భారత రాయబారి సీబీ జార్జ్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగాన్ని కువైట్లోని ఎన్ఆర్ఐలకు చదివి వినిపించారు. ఈ వేడుకల్లో పలువురు ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.