అమెరికా :పీవీకి భారత రత్న ఇవ్వాలని పీవీ తనయ ఎమ్మెల్సీ వాణీదేవి, పీవీ శతాబ్ది ఉత్సవాల కమిటీ సమన్వయకర్త మహేష్ బిగాల అన్నారు. గత 8 సంవత్సరాలుగా యుఎస్ఎ నుంచి నిర్వహించబడుతున్న విదేశీ భారతీయుల కోసం ఒక ప్రసిద్ధ రేడియో ప్రోగ్రాం విరిజల్లుపై హలో తెలంగాణ రేడియో ప్రోగ్రాం 6/29/2021 న దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతాబ్ది పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక ప్రదర్శనను తీసుకువచ్చింది. తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు విజయ్ చావ్వా, అతని బృందం నిర్వహిస్తున్న విదేశీ ఎక్స్క్లూజివ్ రేడియో షోలో ఈ వారం నిర్వాహకులు వాణీదేవి, మహేశ్ బిగాలను అథిలుగా ఆహ్వానించారు.
ఈ ఇంటరాక్టివ్ రేడియో షోలో ఎమ్మెల్సీ వాణీ దేవి ద్వారా పీవీ జీవిత విశేషాలను ఆసక్తికరంగా పాఠకులకు అందించారు. అలాగే వాణీదేవి కూడా తన బాల్యం, వంగర గ్రామంలో తన తండ్రితో ఉన్న విలువైన జ్ఞాపకాలను పంచుకున్నారు. వ్యక్తిత్వ వికాసానికి పీవీ నిలువెత్తు నిదర్శనమన్నారు. ఆమెతో శ్రోతలు మాట్లాడి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు.
మహేష్ బిగాల మాట్లాడుతూ.. ఎన్నారైల కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను నిర్వహించామననారు. సంవత్సరం పొడవునా పీవీ శతజయంతి వేడుకలను జరిపించామన్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం కేసీఆర్కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీవీకి భారతరత్న అవార్డుతో గుర్తించే ప్రయత్నాలకు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రేక్షకులను అభ్యర్థించారు.