హైదరాబాద్ : బీజేపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను అవలంబిస్తూ నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతున్నది. పెంచిన రేట్లను వెంటనే తగ్గించాలని ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం డిమాంచ్ చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా పెంచుతున్న గ్యాస్, పెట్రోల్ ధరలకు నిరసనగా ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఆధ్వర్యంలో రాంనగర్ చౌరస్తాలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో అనిల్ కూర్మాచలం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ఏడు సంవత్సరాల బీజేపీ పాలనలో సామాన్య ప్రజల బతుకు ఆగమైందన్నారు. ఇష్టానుసారంగా ధరలు పెంచి సామాన్యులు బతకలేని స్థితికి తీసుకొచ్చారని మండిపడ్డారు. పెంచిన ధరలు తగ్గించే వరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. దేశ ప్రజలంతా ప్రధాని మోదీకి రాబోయే రోజుల్లో సరైన గుణపాఠం చెప్పాలన్నారు.