ఆస్ట్రేలియా : నాడు ఉద్యమంలో నేడు బంగారు తెలంగాణ నిర్మాణంలో అలాగే రేపు జరగపోయే అభివృద్ధిలో.. తెలంగాణకు చెందిన ఎన్ఆర్ఐలు సీఎం కేసీఆర్ వెంటే ఉంటారని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు. నాటి నుంచి నేటి వరకు కేసీఆర్ను, టీఆర్ఎస్ను అస్తిరపరిచేందుకు ఎన్నో శక్తులు తమ శాయశక్తులా కృషి చేస్తున్నాయన్నారు.
వీరి కుట్రలకు , కుతంత్రాలకు ఏనాడు తలొగ్గబోమన్నారు. ఈటెల నేడు ప్రదర్శించేది ధర్మాగ్రహమే అయితే.. ఇన్నేళ్ల సావాసంలో ఎందుకు ఈ ధర్మాగ్రహన్ని ప్రదర్శించలేదని ప్రశ్నించారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా మేమంతా సీఎం కేసీఆర్ వెంటే ఉంటామన్నారు.
ఇవి కూడా చదవండి..
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన శ్రీనివాస్ గుప్తా
పీఎంవో వల్ల కాదు కానీ.. ఆ పని గడ్కరీకి అప్పగించండి: ప్రధానికి స్వామి సూచన