లండన్ : పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్న మాజీ ఎంపీ, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యవస్థాపకుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మక గ్లోబల్ గ్రీన్ ఐకాన్ పురస్కారాన్ని అందుకోవడానికి లండన్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ శాఖ అధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపకులు అనిల్ కూర్మాచలం, అధ్యక్షుడు నవీన్ రెడ్డి, గ్రీన్ ఇండియా కో ఫౌండర్ రాఘవేంద్ర యాదవ్, ఉపాధ్యక్షుడు హరి గౌడ్ నవాబుపేట్, సత్య మూర్తి చిలుముల, మాజీ అధ్యక్షుడు అశోక్ గౌడ్ దూసరి, పీఆర్ రవి ప్రదీప్ పులుసు, యూత్ వింగ్ సెక్రటరీలు పవన్ కుమార్ గౌడ్, తరుణ్ లునావత్, యూత్ వింగ్ కో ఆర్డినేటర్ అమరేశ్వరి బోయిని, మీడియా కో ఆర్డినేటర్ సాయి కిరణ్ రావు పేరాల, లెస్టర్ ఇంచార్జ్ సాకేత్ కాచవరపు, టాక్ జనరల్ సెక్రటరీ సుప్రజ పులుసు, సుమంత్, సంకీర్త్ రెడ్డి, శివ చరణ్ ఉన్నారు.