Nagaraju Gurrala | ఇటీవల ఒక విలేకరి ‘కరువు వస్తే పంటలకు రైతులకు నీళ్లు ఎలా అందిస్తారు?’ అని ప్రశ్నించగా, ‘వాళ్లను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సౌత్ ఆఫ్రికా ఎన్నారై బీఆర్ఎస్ కార్యకర్త అనీల్ రెడ్డి మిట్టపల్లి వేములవాడలో రైతుల పక్షాన నిలిచి స్వచ్ఛందంగా రక్తదానం చేయడం అభినందనీయమని బీఆర్ఎస్ ఎన్నారై నాయకులు నాగరాజు గుర్రాల తెలిపారు. రైతుల పట్ల ప్రేమను, బాధ్యతను మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తూ రక్తదానం చేయడం సమాజానికి గొప్ప సందేశమని నాగరాజు గుర్రాల అన్నారు. రైతు సంక్షేమం కోసం సేవ చేయాలనే తపనతో ముందుకు వచ్చిన అనీల్ రెడ్డి మిట్టపల్లి సేవాభావం ప్రశంసనీయమని కొనియాడారు.
సౌత్ ఆఫ్రికా బీఆర్ఎస్ శాఖ తరఫున అనీల్ రెడ్డి మిట్టపల్లికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని..రైతుల కోసం ఆయన చేసిన ఈ సేవా కార్యక్రమం మరెందరికో స్ఫూర్తిగా నిలవాలని నాగరాజు గుర్రాల ఆకాంక్షించారు.