KTR Birthday | టీఆర్ఎస్ ఎన్నారై యూకే శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ఐటీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేటీఆర్ పిలుపు మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’లో భాగంగా పార్టీ కార్యవర్గ సభ్యులు యూకే ఎన్హెచ్ఎస్లై రక్తదానం చేశారు. అశోక్ దూసరి ఆధ్వర్యంలో రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని, బంగారు తెలంగాణ కోసం కేటీఆర్ అహర్నిశలు పాటుపడుతున్నారన్నారు.
టీఆర్ఎస్ ఎన్నారై ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల మాట్లాడుతూ నేడు భారత్లో తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు ఉందని, ఇతర రాష్ట్రాలకు ధీటుగా ఐటీరంగంలో అభివృద్ధి సాధిస్తుందన్నారు. రాష్ట్రాన్ని దేశానికే తలమానికంగా నిలపడంలో కేటీఆర్ కృషి మరువలేనిదన్నారు. అనంతరం నేతలు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, అడ్వైజర్ బోర్డు వైస్ చైర్మన్ సీకా చందు గౌడ్, కార్యదర్శులు సత్య చిలుముల, సృజన్ రెడ్డి, జాయింట్ సెక్రెటరీ సతీశ్రెడ్డి, గణేశ్, నిఖిల్ పాల్గొన్నారు.