హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిలో ఎన్నారైలు తోడ్పాటును అందించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన వర్జీనియాలో ఎన్నారైలతో మాట్లాడారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
సినీ నిర్మాత దిల్ రాజు, బీఆర్ఎస్ ఎన్నారై విభాగం నాయకులు, కార్యకర్తలు, తానా ప్రతినిధుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణను సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పల్లె దేశానికి ఆదర్శవంతంగా మారుతున్నదని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని చెప్పారు. రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్న సీఎం కేసీఆర్ సంకల్పంలో ఎన్నారైలు తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు.