Karthika Vana Bhojanalu | సింగపూర్లోని ఆర్యవైశ్యులందరూ సింగపూర్కు దగ్గరలో గల కూర్మ ద్వీపం (కుసు ఐలాండ్)లో భక్తి శ్రద్ధలతో కార్తీక వన భోజనాలు నిర్వహించారు. ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక్కో వంటకంతో 80కి పైగా కుటుంబాలకు చెందిన 250 మంది సముద్రంలో నౌకా విహారం ద్వారా కుసు ద్వీపాన్ని చేరుకున్నారు. ద్వీపానికి చేరుకున్న తర్వాత తొలుత విజయలక్ష్మి, ముక్క ఇంద్రయ్య కుటుంబం, అంజలి, చైతన్య సముద్రం నుంచి తీసుకొచ్చిన ఇసుకతో ఒక సైకత లింగం తయారు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా సామూహిక లింగాష్టకంలో పాల్గొన్నారు. శ్రీ మారియమ్మన్ ఆలయం నుంచి తీసుకొచ్చిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు.
సింగపూర్ వాసవి క్లబ్ కార్యదర్శి నరేంద్ర కుమార్ నారంశెట్టి మాట్లాడుతూ కార్తీక మాస వైభవాన్ని, ప్రాముఖ్యతను వెల్లడించారు. కరోనా తర్వాత మూడేండ్లకు కార్తీక వన భోజనాలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. శివుడి రూపాలు, వాటి విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా అందరూ సామూహికంగా కార్తీక దీప సమర్పణ చేశారు.
క్లబ్ సహా-వ్యవస్థాపకుడు మంచికంటి శ్రీధర్ మాట్లాడుతూ తమ కమిటీ గత పదేండ్లలో ఎంతో వైభవాన్ని సంతరించుకున్నదని చెప్పారు. మరికొంత మంది సీనియర్ సభ్యులు విజయ్ వల్లంకొండ, భాస్కర్ గుప్త, ప్రసాద్ బచ్చు, దివ్య గాజులపల్లి, గోపి కిషోర్, సతీష్ కోట తదితరులు తమ విలువైన అనుభూతులను గుర్తు చేసుకున్నారు. ఈ
కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు క్లబ్ సేవాదళ్ సభ్యులు శివ కిషన్, ఫణీష్, వినయ్ చంద్, శ్రీనివాస్ అమర, సతీష్ వుద్దగిరి, హైందవి, కొత్త హరింద్రబాబు, అనిల్ గాజులపల్లి, మణికంఠ, పల్లపోతుల కిషోర్ , నందన్, మానస్ తదితరులు కృషి చేశారు.
ఈ కార్యక్రమంలో చిరంజీవి మౌల్య కిషోర్ నాట్య ప్రదర్శన, అమృత వాణి-మానస నృత్య ప్రదర్శనలు అలరించాయి. ఫ్లాష్ మాబ్, విగ్నేశ్వర్ రావ్, మానస సహకారంతో నిర్వహించిన ఫ్యాషన్ వాక్ అందరినీ ఆనందింపచేసింది.శశిధర్, విశ్వేశ్వర్, దత్త సహాయంతో సభా ప్రాంగణాన్ని అలంకరించారు. పిల్లలు, మహిళలు ప్రత్యేకంగా ఆట, పాటల కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి యాదా నరేశ్, శ్రావణిలు ప్రత్యేక బహుమతులు అందజేశారు. కార్యక్రమం విజయవంతం చేయడంలో కిశోర్ శెట్టి చేసిన పాత్రను వాసవి క్లబ్ కార్యదర్శి నరేంద్ర కుమార్ నారంశెట్టి, సీనియర్ కమిటీ సభ్యుడు ముక్కా కిశోర్ అభినందించారు. తొమ్మిదేండ్లుగా నరేంద్ర గారి సేవలను గుర్తించారు. నరేంద్ర దంపతులకు సన్మానం చేశారు.
వినయ్, శిల్ప మకేష్, దివ్య మంజుల, స్వప్న మంచికంటి, నీమ ఆనంద్, శ్రావణి, హైందవి తదితరుల ఆధ్వర్యంలోని భోజన కమిటీ అందరితో సమన్వయం చేసుకుంటూ కార్యక్రమానికి హాజరైన వారికి షడ్రసోపేతమైన విందు భోజనాలు అందించారు. ఈ కార్యక్రమానికి కౌ అండ్ ఫార్మర్, సంపూర్ణ స్వదేశీ, సౌజి డేకర్స్, కామాక్షి జువెల్లర్స్, జి ఆర్ టి జువెల్లర్స్ సహకరించారు.