ఈ కాలంలో నీతి, నిజాయితీలు ఎక్కడున్నాయి? అని చాలా మంది అడుగుతుంటారు. కానీ ఇప్పటికీ చాలా మంది ప్రజలు నిజాయితీగా జీవనం సాగిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుండటం కనిపిస్తూనే ఉంటుంది. తాజాగా దుబాయ్లో ఇలాంటి ఘటనే జరిగింది. భారత్కు చెందిన వలస కార్మికుడు తరీక్ మహమూద్ ఖలీద్ మహమూద్ అనే యువకుడు..
ఇక్కడ అల్ బార్షా ప్రాంతంలో నివశిస్తున్నాడు. తను ఉండే అపార్ట్మెంట్ లిఫ్టులో అతనికి ఒక బ్యాగ్ కనిపించింది. ఏంటా? అని చూస్తూ పది లక్షల దీనార్లు (రూ.2.1 కోట్లపైగా) డబ్బులు దొరికాయి. వాటిని చూసి కూడా దురాశ చెందని తరీక్ మహమూద్.. వెంటనే ఆ డబ్బును తీసుకెళ్లి స్థానిక పోలీసు స్టేషన్లో అప్పగించాడు.
అతని నిజాయితీ చూసి మెచ్చుకున్న పోలీసులు.. తరీక్ను గౌరవిస్తూ ఒక ధ్రువపత్రాన్ని అందించారు. ‘‘మన సమాజంలో ఉండే ఉన్నతమైన విలువలకు అతని నిజాయితీ అద్దం పడుతోంది’’ అని పోలీసు ఉన్నతాధికారులు మెచ్చుకున్నారు.