డాలస్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు (KTR) అమెరికాలోని డాలస్లో పార్టీ శ్రేణులు, తెలంగాణ ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. డాలస్ అంత తెలంగాణ మయమైంది. ఎటుచూసినా గులాబీ రెపరెలే కనిపించాయి. ఎల్లలు లేని ఆప్యాయత, అభిమానం డాలస్లో తమ ప్రియతమ నాయకుడు కేటీఆర్తో ఆప్యాయంగా ముచ్చటించి, బీఆర్ఎస్ శ్రేణులు, తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేష్ బిగాల అధ్యక్షతన ఇండియా నుంచి వచ్చిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, ఎన్నారైలతో అల్పాహార సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేటీఆర్ అందరితో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు, అన్ని విషయాలపై చర్చించారు. అక్కడ పెద్ద ఎత్తున వస్తున్న స్పందనపై హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ.. ఎటు చూసినా కేటీఆర్ ఏమి మాట్లాడుతారో అని డాలస్ అంత ఎదురుచూస్తుందన్నారు. అలాగే బీఆర్ఎస్ యుఎస్ఎ అడ్వైజరీ బోర్డు చైర్మన్ మహేశ్ తన్నీరు సమన్వయం చేస్తూ సభను విజవంతంగా చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, ఎన్నారై నాయకులు పాల్గొన్నారు.