హైదరాబాద్ : ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై రెండోసారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల కవితకు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ ఎంపీగా కవిత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు.
తెలంగాణ జాగృతితో రాష్ట్ర పండుగ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశారని, సాంస్కృతిక వారధిగా నిలిచారన్నారు. సమైక్యరాష్ట్రంలో ఆత్మనూన్యతకు, పాలకుల వివక్షకు గురైన బతుకమ్మ పండుగను తెలంగాణ బిడ్డగా భుజానేసుకుని ప్రపంచం గుర్తించి గౌరవించేలా బతుకమ్మ విశిష్ఠతను ప్రపంచానికి ఎలుగెత్తి చాటారన్నారు.
జాగృతి సంస్థ ద్వారా బతుకమ్మ వేదికగా మహిళలను చైతన్య పరచి తెలంగాణ ఉద్యమంలో మహిళలు ప్రధాన పాత్ర పోషించేలా కృషి చేశారన్నారు.
అరవై దశాబ్ధాల పాలనలో తీవ్ర వివక్షత గురైన నిజామాబాదు పార్లమెంట్ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తెచ్చి ఇంతవరకు ఎవరు చేయని అభివృద్ధిని కార్యక్రమాలను చేసి నిజామాబాద్ రూపురేఖలను మార్చిన ధీర వనిత అని కొనియాడారు. ఈ సందర్భంగా కవిత మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు.