జెడ్డా : కరోనా మహమ్మారికి సౌదీ అరేబియాలో ఉంటున్న ఇద్దరు తెలంగాణ ఎన్నారైలు బలయ్యారు. కరీంనగర్ కశ్మీరగడ్డకు చెందిన మహబూబ్ అలీ సిద్ధిఖీ(40) గత కొన్నేండ్ల క్రితం సౌదీలోని డమ్మమ్కు వలస వెళ్లాడు. సిద్దిఖీకి రెండు వారాల క్రితం కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మహబూబ్ కన్నుమూసినట్లు ఆయన స్నేహితులు తెలిపారు.
హైదరాబాద్లోని టోలిచౌకికి చెందిన మహమ్మద్ వహీద్(50) కూడా జెడ్డాలో నివాసముంటున్నాడు. స్థానికంగా ఉన్న టెలి కమ్యూనికేషన్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయనకు కూడా రెండు వారాల క్రితం కరోనా సోకింది. ఆయన కూడా నిన్న చనిపోయాడు. వహీద్ తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి జెడ్డాలో ఉంటున్నాడు.