తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ( Telangana Formation Day ) ఈ యేడాది కూడా ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ మలేషియా, మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా) సంస్థలు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నాయని, బీఆర్ఎస్ మలేషియా( BRS Malaysia) అధ్యక్షులు మారుతి కుర్మ( Maruthi Kurma ) తెలిపారు.
మైటా అధ్యక్షులు సైదం తిరుపతి, బీఆర్ఎస్ మలేషియా స్థాపకులు చిట్టిబాబు చిరుత కార్యక్రమ నిర్వహణలో చురుకుగా పాల్గొంటున్నారని వివరించారు. ఈ వేడుకలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాక కోసం తెలుగు ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన సభ్యత్వ నమోదులో మునిగల అరుణ్, మిథున్, దిలీప్, సందీప్ గౌడ్, శశి, అభిలాష్, అన్వేష్, మధుకర్, హరీష్ గోకుల్ తదితరులు పాల్గొన్నారు.