హైదరాబాద్ : తెలుగు అసోసియేషన్ స్విట్జర్లాండ్ వారి ఆధ్వర్యంలో జ్యురీచ్లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. నవంబర్ 21న నిర్వహించిన ఈ వేడుకల్లో తెలుగు ప్రజలందరూ పాల్గొని ఎంజాయ్ చేశారు. తెలుగు అసోసియేషన్ స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ కడలి గనికాంబ, జనరల్ సెక్రటరీ కిశోర్ తాటికొండ, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో దీపావళి వేడుకలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో వేడుకలు కనువిందుగా కొనసాగాయి. స్విట్జర్లాండ్లో స్థిరపడిన 150 మంది తెలుగువారు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. దీపావళి వేడుకల నేపథ్యంలో చిన్నారులు ఉత్సాహంగా బాణాసంచా కాల్చి ఎంజాయ్ చేశారు.