బహ్రెయిన్ : తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా మరోసారి ఎన్నికైన కేసీఆర్కు టీఅర్ఎస్ ఎన్నారై సెల్ బహ్రెయిన్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉద్యమ సారథి కేసీఆర్ దశాబ్దాల తెలంగాణ కలను నెరవేర్చిన గొప్ప నాయకుడన్నారు. చావుకు ఎదురెళ్లి పోరాడి నీళ్లు , నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేర్చిన యోధుడని ప్రశంసించారు.
అభివృద్ధిలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా నిలుపుతున్న సీఎం కేసీఆర్కు టీఅర్ఎస్ ఎన్నారై సెల్ పక్షాన ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.