హైదరాబాద్ : గల్ఫ్దేశమైన కువైట్లో సీఎం కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఎన్నారై శాఖ అధ్యక్షురాలు అభిలాష గొడిశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నేతలంతా కేక్ కట్ చేసి సంబురాలు జరిపారు. ఈ సందర్భంగా బట్టలు పంపిణీ చేయడంతో పాటు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలోనూ భాగస్వాములు కావాలని కోరారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించి, ఎంతో అభివృద్ధి చేయడంతో పాటు పథకాలు అమలు చేస్తున్నారన్నారు. తన పాలనతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. తెలంగాణ తరహాలో దేశాభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమన్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ను ప్రధానమంత్రిగా చూడాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు గంగాధర్ జీకే, రవి గన్నరపు, సురేష్ గౌడ్, అయ్యప్ప, రవి సుధగాని, జగదీశ్ సాయి నాయుడు, మహమ్మద్ దస్తగిరి తదితరులు పాల్గొన్నారు.