లండన్: సీఎం కేసీఆర్ 68వ జన్మదిన వేడుకలు లండన్లో ఘనంగా జరిగాయి. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూకే నలుమూలల నుంచి సుమారు 2 వందలకు పైగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ కార్యకర్తలు, ఇతర ప్రవాస కుటుంబసభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు అశోక్ గౌడ్ మాట్లాడుతూ.. ఉద్యమ నాయకుడే పాలకుడై తెలంగాణను దేశంలోనే అగ్ర స్థానంలో నిలిపారని, ఇలాంటి నాయకుడు ఉండటం తెలంగాణ ప్రజల అదృష్టమని చెప్పారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను నేడు దేశమంతా అనుసరిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని ఎదురుచూస్తున్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండి తెలంగాణను మరింత అభివృద్ధి చేయాలని, దేవుడి ఆశీస్సులు ఎల్లపుడూ వారికి ఉండాలని ఆకాంక్షించారు.
దాదాపు పదకొండేండ్లుగా లండన్లో కేసీఆర్ జన్మదిన వేడుకలను నిర్వహిస్తున్నామని తెలిపారు. గతంలో లండన్లో మాత్రమే నిర్వహించే వేడుకలు నేడు ప్రపంచమంతా జరుగుతున్నాయని, తమకెంతో గర్వంగా ఉందని, నిర్వాహుకులందరికీ, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ ప్రతినిధులకు ఆయన కృతఙ్ఞతలు తెలిపారు.
సర్వమత ప్రార్థనలు చేసి సీఎం కేసీఆర్ను ఆశీర్వదించిన అన్ని మతాల ప్రతినిధులకు ఎన్నారై టీఆర్ఎస్ యూకే ప్రధాన కార్యదర్శి, టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ధన్యవాదాలు తెలిపారు. తాము వేడుకలకే పరిమితం కాలేదని, తెలంగాణలో సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి వందన, ప్రభాకర్ ఖాజా, నవీన్ రెడ్డి, సత్యమూర్తి చిలుముల, హరి గౌడ్ నవాపేట్, మల్లా రెడ్డి, సేరు సంజయ్, వెంకట్ రెడ్డి, శ్రీధర్ రావు తక్కళ్లపల్లి, సత్యం రెడ్డి కంది, వీర ప్రవీణ్ కుమార్, అబుజాఫర్, నవీన్ భువనగిరి, రవి ప్రదీప్ పులుసు, రవి రేతినేని, సురేష్ బుడగం, శ్రీకాంత్ జెల్ల, సృజన్ రెడ్డి చాడా, సత్యపాల్ పింగళి, రమేష్ ఎసెంపల్లి, మధు రెడ్డి, గణేష్ పస్తం, పృథ్వీ రావుల, పవిత్రా రెడ్డి, స్వాతి, మాధవ్, శ్రీకాంత్ ముదిరాజ్, జాహ్నవి, సుప్రజ, క్రాంతి, శైలజ, నంతిని, విద్య, అపర్ణ, పావని తదితరులు పాల్గొన్నారు.