BRS | బీఆర్ఎస్ పార్టీ 25వ వసంతంలో అడుగిడుతున్న సందర్భంగా ఈ నెల 27 న వరంగల్ ఎల్కతుర్తిలో రజతోత్సవ సభ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ‘చలో వరంగల్’ పోస్టర్ను ఎన్నారై బీఆర్ఎస్ యూకే ఆధ్వర్యంలో చారిత్రాత్మక లండన్ (టవర్) బ్రిడ్జి వద్ద బీఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు. చారిత్రాత్మక రజతోత్సవ సభకు ప్రజలంతా భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి కోరారు. మన ఇంటి పార్టీ.. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో దేశంలోనే మన రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టిన బీఆర్ఎస్ పార్టీని మనం కాపాడుకోవాలన్నారు. కేసీఆర్ నాయకత్వమే మనకు శ్రీరామా రక్ష నవీన్ రెడ్డి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నారైలంతా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారన్నారు. అలాగే, రానున్న రోజుల్లో లండన్లో సైతం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని నవీన్ రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎన్నారై బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల, కార్యదర్శి రవి ప్రదీప్ పులుసు, అడ్వైజర్ వైస్ చైర్మన్ గణేశ్ కుప్పాల, సభ్యులు పవన్ కల్యాణ్, అజయ్ రావు గండ్ర పాల్గొన్నారు.