BRS Party | భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ వేడుకలు లండన్లోని హౌంస్లౌ ప్రాంతంలో ఆ పార్టీ ఎన్నారైశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు, ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం హాజరయ్యారు. మొదట జయశంకర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అమరవీరులను స్మరిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి, దేశ్కి నేత కేసీఆర్ అంటూ నినదించారు.