హైదరాబాద్ : ప్రముఖ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వర రావు శత జయంతి వేడుకల సంవత్సర సందర్భంగా ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలనే నినాదం రోజు రోజుకు బలపడుతున్నది. ఇదే నినాదంతో యూఎస్ఏ నుంచి శంకర నేత్రాలయ యూఎస్ఏ అధ్యక్షుడు బాల ఇందుర్తి ఆధ్వర్యంలో ఇప్పటివరకు 60 పైగా టీవీ కార్యక్రమాలను నిర్వహించి ప్రపంచం నలుమూలలో ఉన్న తెలుగు సంస్థలను ఏకాతాటిపై తీసుకువస్తున్నట్లు నిర్వాహుకులు తెలిపారు.
ఇందులో భాగంగా యూఎస్ఏ నుంచి అమెరికా గానకోకిల శారద ఆకనూరి వ్యాఖ్యాతగా 8 మే 2022న జరిగిన అంతర్జాల (Zoom) కార్యక్రమంలో పద్మవిభూషణ్ డా. కేజే జేసుదాస్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఘంటసాల గొప్ప గాయకుడు అన్నారు. మా చిన్ననాటి రోజుల్లో దేవదాసు సినిమా పాటలు విని పెరిగానని, ముఖ్యంగా ఘంటసాల పాడిన శాంతినివాసం సినిమా మలయాళంలో అనువాదం అయినప్పుడు ఆ సినిమాకి ఘంటసాల తెలుగులో పాడిన తెలుగు పాటకు నేను మలయాళంలో పాడటం అది నా కెరీర్ లో రెండవ సినిమా అవడం చాలా అదృష్టమని తెలిపారు.
తన కెరీర్ ప్రారంభంలో ఘంటసాలతో కలసి పాడటం ద్వారా ఎన్నో మెళుకువలు నేర్చుకున్నాని ఆయన తెలిపారు. ఘంటసాల గొప్ప గాయకుడు అని ఇదే విషయాన్నీ SPB బాలు ఎప్పుడు చెపుతుండేవారిని ఈ సందర్భంగా బాలుని కూడా గుర్తు చేసుకున్నారు. దక్షిణ భారత గాయకులు అందరికి ఎంత గొప్ప గౌరవం ఉందొ ఉత్తరాది గాయకులు అయిన లతా మంగేష్కర్, మహమ్మద్ రవి వంటి గాయకులు కూడా అంతే గౌరవం ఘంటసాల మీద చూపే వారని తెలుపుతూ రెండు పాటల పల్లవులను పాడి టీవీ ప్రేక్షకులను అలరించారు.
ఘంటసాల భారతరత్న పురస్కారానికి పూర్తిగా అర్హులు అని తెలియచేస్తూ తన పూర్తి మద్దతుని తెలియచేసారు. చెన్నై నుంచి ఘంటసాల కోడలు కృష్ణ కుమారి ఘంటసాల అతిథిగా పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. నిర్వాహుకులు చేస్తున్న ప్రయత్నాన్ని ఘంటసాల కుటుంబం తరపున మనస్ఫూర్తిగా అభినందించారు.
యూఎస్ఏ నుంచి చైర్మన్, గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్ఏ ప్రవాసీ భారతీయ సమ్మాన్, సుబాష్ రజ్దాన్ , FACC డైరెక్టర్, GAPI వాలంటీర్ క్లినిక్ డా. శ్రీని గంగసాని M.D, శంకర్ నేత్రాలయ బోర్డు సభ్యులు వంశీ కృష్ణ ఇరువరం, మలేషియా నుంచి మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకట ప్రతాప్, సింగపూర్ నుంచి తెలంగాణ కల్చరల్ సొసైటీ అధ్యక్షుడు నీలం మహేందర్, శ్రీ సాంస్కృతిక కళాసారథి వ్యవస్థాపక అధ్యక్షుడు రత్న కుమార్ కవుటూరు, స్కాట్లాండ్ నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్, UK అధ్యక్షుడు శివ చింపిరి, నైజీరియా నుంచి తెలుగు అసోసియేషన్ ఆఫ్ నైజీరియా అధ్యక్షుడు మూగలమర్రి లోకనాథరెడ్డి, స్విట్జర్లాండ్ నుంచి స్విట్జర్లాండ్ తెలుగు సంఘం అధ్యక్షురాలు గని కడలి తదితరులు పాల్గొని మాట్లాడుతూ.. పద్మవిభూషణ్ డా కేజే జేసుదాస్ ఈ కార్యక్రమానికి వచ్చి మద్దతు తెలపడం ఒక గొప్ప శుభపరిణామం అన్నారు.
ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి తోడ్పాటు అందించిందన్నారు. ఘంటసాలకు భారతరత్న వచ్చేంతవరకు అందరూ సమిష్టిగా కృషి చేయాలని తెలిపారు. ఘంటసాల కు భారతరత్న ఇవ్వాలని మొదలుపెట్టిన సంతకాల సేకరణకు (Signature Campaign) అనూహ్యస్పందన లభిస్తోందని నిర్వాహుకులు తెలిపారు మరిన్ని వివరాల కోసం కింది లింక్ను చూడొచ్చని నిర్వాహకులు తెలిపారు.
: https://www.change.org/BharatRatnaforGhantasala