పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో వచ్చేనెల 10న లండన్లో మెగా బతుకమ్మ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ వేడుకల పోస్టర్ను మంగళవారం హైదరాబాద్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం ఆవిషరించారు. తెలంగాణ సంసృతి, సంప్రదాయాలకు ప్రతీకైన బతుకమ్మ పండుగను దేశ విదేశాల్లోనూ ఘనంగా నిర్వహిస్తున్నామని ఆమె చెప్పారు. యూకే జాగృతి నాయకులను ఎమ్మెల్సీ అభినందించారు. వేడుకల్లో యూకే తెలంగాణ జాగృతి ప్రతినిధులు, ప్రవాస తెలంగాణవాసులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆమె పిలుపునిచ్చారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు చేనేత చీరెలను అందిస్తామని తెలంగాణ జాగృతి యూకే విభాగం అధ్యక్షుడు సుమన్ బల్మూరి వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేడే రాజీవ్సాగర్, ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, కార్యదర్శి రోహిత్రావు, నాయకులు ప్రశాంత్ పూస, నితీశ్, రోహిత్రావ్, దినేశ్రెడ్డి, అనుషా దుర్గా, జితూ, రోహిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.