Crime News | అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న బీలం అచ్యుత్ మోటారు సైకిల్ ప్రమాదంలో బుధవారం మధ్యాహ్నం మరణించాడు. ఈ అంశాన్ని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. ‘న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ విద్యార్థి అచ్యుత్ బైక్ ప్రమాదంలో బుధవారం మధ్యాహ్నం దుర్మరణం పాలయ్యాడు. ఆయన అకాల మరణ వార్తతో చాలా బాధ కలిగింది. మృతుడి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. బాధిత కుటుంబం, స్థానిక ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపి అచ్యుత్ మృతదేహాన్ని భారత్ కు పంపించడానికి సహాయ సహకారాలు అందిస్తామని కాన్సులేట్ జనరల్ ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ ఖాతాలో పోస్ట్ చేశారు.