హైదరాబాద్ : ఈ ఏడాది డిసెంబర్ 5వ తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అమెరికా తెలుగు సంఘం( ATA ) వేడుకలను నిర్వహించనున్నట్లు ఆటా ప్రెసిడెంట్ మధు బొమ్మినేని ఒక ప్రకటన విడుదల చేశారు.
డిసెంబర్ 5 నుంచి 24వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఆట, పాట పోటీలు, సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక ఉత్సవాలు, సెమినార్లు, మహిళా సాధికారత కార్యక్రమాలను నిర్వహించనున్నారు. చివరగా డిసెంబర్ 26వ తేదీన హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఆటా గ్రాండ్ ఫినాలే వేడుకలను నిర్వహించనున్నట్లు మధు బొమ్మినేని తెలిపారు.