హైదరాబాద్ : సింగపూర్(Singapore)లో అయోధ్య రాములవారి అక్షింతల వితరణ(Akshinthala Vitharana) మహోత్సవం వైభవంగా జరిగింది. తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (TCSS) వారు అయోధ్య నుంచి నుంచి ప్రత్యేకంగా తెప్పించిన అక్షింతలు సింగపూర్లో నివసిసిస్తున్న భక్తులకు అందజేశారు. రాములోరి ప్రాణప్రతిష్ట రోజైన జనవరి 22 న ఇక్కడి చాంగి విలేజ్లోని శ్రీరాముని గుడిలో ఎంతో వేడుకగా నిర్వహించారు.
అక్షింతల వితరణ మహోత్సవం నిర్వహించే అవకాశం దక్కడం సొసైటీకి దక్కిన పుణ్యం అని సొసైటీ సభ్యులు తెలిపారు. ఈ పవిత్ర కార్యం లో స్థానిక భక్తులందరూ భక్తిశ్రద్ధలతో రామ నామ స్మరణ చేస్తూ ఈ కార్యక్రమం లో పాల్గొని ప్రసాదం తో పాటు అక్షింతలు స్వీకరించి శ్రీ రాముని పూజలో పాల్గొన్నారు. కన్నుల పండువగా అక్షింతల కార్యాక్రమాన్ని నిర్వహించిన తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ బృందాన్ని భక్తులు అభినందించారు.