హైదరాబాద్ : వాషింగ్టన్ డీసీ వేదికగా జులై 1వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరగబోయే 17వ అమెరికన్ తెలుగు అసొసియేషన్ మహాసభలకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అత్యంత సుందరమైన వాల్టర్ ఈ వాషింగ్టన్ కన్వెన్షన్ సెంటర్లో ఆటా మహాసభలను నిర్వహించనున్నారు.
కాగా, వాషింగ్టన్ డీసీలో జరగనున్న ఆటా మహాసభల్లో తెలుగు యువతీ యువకులకోసం ప్రత్యేకంగా వివాహ పరిచయ వేదికను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా పెండ్లి కావాల్సిన అమ్మాయిలు, అబ్బాయిలు తమ పేర్లను రిజిష్టర్ చేసుకుంటే వారిని ఈ మేట్రిమోనియల్ వేదికపై తీసుకెళ్లి వివాహ సంబంధాలు నిశ్చయం చేసుకునేందుకు అవకాశాన్ని నిర్వాహకులు కల్పించనున్నారు.
ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరుకున్నారు. ఈ కార్యక్రమానికి అనిత ముతోజు చైర్మన్ వ్యవహరిస్తున్నారు. సాయి వల్లూరిపల్లి, సుదర్శన్ రెడ్డి అరువ, కోటిరెడ్డి కో చైర్మన్లుగా ఉన్నారు.