హైదరాబాద్: కేంద్ర అణుశక్తి శాఖ ఆధ్వర్యంలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్రేడ్ అప్రెంటిస్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 15 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 75 అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఎంపికైనవారు కర్ణాటకలోని కైగా సైట్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం అప్రెంటిస్లు: 75
ఇందులో ఫిట్టర్ 20, టర్నర్ 4, మెషినిస్ట్ 2, ఎలక్ట్రిషన్ 30, ఎలక్ట్రానిక్ లేదా మెకానిక్ 9, వెల్డర్ 4, డ్రాట్స్మ్యాన్ 4, సర్వేయర్ 2 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ చేసి ఉండాలి. అభ్యర్థులు 14 నుంచి 24 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐ, పదో తరగతిలో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: సెప్టెంబర్ 30
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 15
వెబ్సైట్: www.npcilcareers.co.in