న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎన్ఎండీసీ వివిధ విభాగాల్లో అప్రెంటిస్లు అందిస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తున్నది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 59 అప్రెంటిస్షిప్లను అందిస్తున్నది. ఇందులో ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్లు ఉన్నాయి. ఐటీఐ, డిప్లొమా పూర్తిచేసినవారు నేరుగా ఇంటర్వ్యూకి హాజరు కావచ్చు. ఎంపికైనవారు ఛత్తీస్గఢ్లోని ధన్వాడలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 59
ఇందులో ట్రేడ్ అప్రెంటిస్ 30 (కోపా), గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ 16 (మెకానికల్ ఇంజినీర్ 6, ఎలక్ట్రికల్ ఇంజినీర్ 3, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రాన్ ఇంజినీరింగ్ 1, మైనింగ్ ఇంజినీరింగ్ 4, సివిల్ ఇంజినీరింగ్ 2, టెక్నీషియన్ అప్రెంటిస్ 13 (మెకానికల్ ఇంజినీర్ 5, ఎలక్ట్రానిక్ ఇంజినీర్ 2, ఎలక్ట్రాన్ అండ్ టెలికమ్ ఇంజినీరింగ్ 1, మైనింగ్ ఇంజినీరింగ్ 1, ఎంఓఎం 3, కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ 1) చొప్పు ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్ లేదా బ్రాంచీలో ఐటీఐ, డిగ్రీ, డిప్లొమా చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ రోజు సంబంధిత సర్టిఫికెట్లతో నేరుగా సంబంధిత చిరునామాకు హాజరుకావాలి.
అడ్రస్: Training Institute, BIOM, Bacheli Complex,
Bacheli, Dantewada, Chhattisgarh
ఇంటర్వ్యూ తేదీలు: 2022, జనవరి 20, 21, 22, 23, 24 తేదీల్లో
వెబ్సైట్: https://www.nmdc.co.in/