పదో తరగతి పాసై ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి సువర్ణావకాశం. ఇలాంటి వారి కోసం ఇండియన్ నేవీ పలు ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలను చేసింది. టెన్త్ పాసైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వీటిలో గ్రూప్ బీ కింద టైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ క్లాసిఫైడ్స్, గ్రూప్ సీ కింద సివిలియన్ మోటార్ డ్రైవర్, స్టాఫ్ నర్స్ పోస్టులు ఉన్నాయి.
ఇండియన్ నేవీలో పదో తరగతి పాసైన వారి కోసం పలు ఉద్యోగాల భర్తీ చేపడుతున్నది. గ్రూప్ బీ కింద 6 టైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ క్లాసిఫైడ్స్, గ్రూప్ సీ కింద 40 సివిలియన్ మోటార్ డ్రైవర్స్, 3 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేస్తున్నారు. దరఖాస్తులను పంపించిన అనంతరం షార్ట్లిస్ట్ చేయబడిన అర్హులైన అభ్యర్థులంతా వ్రాత పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ పరీక్షలో అభ్యర్థులు ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. సివిలియన్ మోటార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు డ్రైవింగ్ టెస్ట్ ఇవ్వాలి. దీనిలో ఉత్తీర్ణత సాధించిన తర్వాతే ఉద్యోగానికి ఎంపికవుతారు. ఎంపికైన అభ్యర్థులు వెస్ట్రన్ నేవల్ కమాండ్ నియంత్రణలో ఉన్న ఏదైనా యూనిట్లో పని చేయాల్సి ఉంటుంది. అయితే, నౌకాదళం ఆవసరాల మేరకు దేశంలోని ఏదైనా నావికాదళ యూనిట్లోగానీ, నిర్మాణంలోగానీ సేవలందించేందుకు బదిలీలు ఉంటాయి.
స్టాఫ్ నర్స్ – లెవెల్ 7 కింద రూ. 44,900 నుంచి రూ. 1,42,400, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- లెవెల్ 6 కింద రూ. 35,400 నుంచి రూ. 1,12,400, సివిలియన్ మోటార్ డ్రైవర్- లెవెల్ 2 కింద రూ. 19,900 నుంచి రూ. 63,200 గా జీతభత్యాలు ఉంటాయి. అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తులను ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ ( సీసీపీఓ కోసం), హెడ్క్వార్టర్స్, వెస్ట్రన్ నేవల్ కమాండ్, బల్లార్డ్ ఎస్టేట్, టైగర్ గేట్ దగ్గర, ముంబై-400 001 చిరునామాకు పంపాల్సి ఉంటుంది.