హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): గ్రూప్-1 దరఖాస్తులకు తుది గడువు మరో 11 రోజులు మాత్రమే ఉన్నది. ఈ పరీక్షకు ఇప్పటి వరకూ 1,66,679 మంది దరఖాస్తు చేశారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కొత్తగా 1,28, 578 మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారు. ఓటీఆర్) చేసుకొంటేనే గ్రూప్-1కు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉన్నది. గతంలోనే 25,38,590 మంది అభ్యర్థులు ఓటీఆర్ చేసుకొన్నా.. కొత్త జోనల్ అమల్లోకి రావటంతో వీరంతా ఓటీఆర్ను ఎడిట్ చేసుకోవాల్సి ఉన్నది. ఇప్పటివరకు 2,68, 928 మంది ఓటీఆర్ అప్డేట్ చేసుకోగా, ఇంకా 22,69,662 మంది అప్డేట్ చేయాల్సి ఉన్నది. గ్రూప్-1కు దరఖాస్తు చేసేందుకు ఈ నెల 31 వరకు అవకాశం ఉన్నది.