న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ, నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. శిక్షణ కాలం ఏడాదిపాటు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 29 వరకు అందుబాటులో ఉంటాయి. ఎంపికైనవారు ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో పనిచేయాల్సి ఉంటుంది. ఎలాంటి రాతపరీక్ష లేకుండా.. అకడమిక్ స్కోర్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం అప్రెంటిస్లు: 50
ఇందులో మెకానికల్ ఇంజినీరింగ్ 20, కంప్యూటర్ సైన్స్ 10, ఎలక్ట్రానిక్స్ 10, సివిల్ ఇంజినీరింగ్ 10 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీఈ లేదా బీటెక్లో మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ టెక్నాలజీ అండ్ కంప్యూర్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ ఇంజినీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. 2021, నవంబర్ 30 నాటికి 25 ఏండ్ల లోపువారై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: బీఈ లేదా బీటెక్లో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ.500
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 29
వెబ్సైట్: https://www.bel-india.in/, www.mhrdnats.gov.in