న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ఆధ్వర్యంలో పనిచేస్తున్న రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (RLDA)లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చేనెల 23 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 45 పోస్టులను భర్తీ చేస్తున్నది. బీఈ, బీటెక్ చేసిన దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. గేట్లో అర్హత సాధించాలి. రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
మొత్తం పోస్టులు: 45
అర్హత: సివిల్ ఇంజినీరింగ్లో బీఈ లేదా బీటెక్ చేసి గేట్లో అర్హత సాధించాలి. అభ్యర్థులు 21 నుంచి 28 ఏండ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 23
వెబ్సైట్: rlda.indianrailways.gov.in.