హైదరాబాద్: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 21న ప్రారంభమవుతాయని, నవంబర్ 11 వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 190 ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఇందులో సివిల్, మెకానికల్, ఈఎన్వీ పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్ రాతపరీక్ష అభ్యర్థులను ఎంపిక చేయనున్నది.
మొత్తం పోస్టులు: 190
ఇందులో సివిల్ ఇంజినీర్ మెకానికల్ 5, సివిల్ 142, సివిల్ లేదా మెకానికల్ 37, సబార్డినేట్ సర్వీసెస్ 5, ఈఎన్వీ 6 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత బ్రాంచీలో బీఈ లేదా బీటెక్ చేసి ఉండాలి. అభ్యర్థులు 18 నుంచి 42 ఏండ్లలోపువారై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఆన్లైన్ రాతపరీక్ష ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ.250 + రూ.80, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ.80.
దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 21
దరఖాస్తులకు చివరితేదీ: నవంబర్ 11
వెబ్సైట్: www.psc.ap.gov.in