నందిపేట్, డిసెంబర్ 3 : మండలంలోని ఉమ్మెడ గ్రామానికి చెందిన ఏర్గట్ల శ్రీకాంత్(25) గోదావరి నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఎస్సై తెలిపిన ప్రకారం.. బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశానికి వెళ్లిన శ్రీకాంత్ 25 రోజుల క్రితం స్వగ్రామం ఉమ్మెడకు వచ్చాడు. నవంబర్ 30న సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆయన తిరిగిరాలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అదృశ్యం కింద కేసు నమోదు చేశారు. శనివారం గోదావరిలో మృతదేహాన్ని గుర్తించిన జాలర్లు ఒడ్డుకు చేర్చారు. మృతదేహాన్ని పరిశీలించగా ఏర్గట్ల శ్రీకాంత్గా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై వెల్లడించారు.