రామారెడ్డి, మే 21: విద్యుత్ షాక్తో రైతు మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని ఘన్పూర్(ఆర్) గ్రామంలో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన భూక్యా రాజు (35) బుధవారం ఉదయం తన సొంత వ్యవసాయ పొలంలో గెట్లపై ఉన్న మొక్కలను గొడ్డలితో తొలగిస్తున్నాడు. ఈ క్రమంలో బోరుబావికి విద్యుత్ సరఫరా అవుతున్న సర్వీస్ వైరు ప్రమాదవశాత్తు గొడ్డలికి తగిలింది.
దీంతో వైరు అతడి చేతిపై పడి షాక్ తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన చుట్టుపక్కల వారు వెంటనే కుటుంబీకులకు సమాచారం ఇచ్చి, చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. గమనించిన వైద్యులు అతడు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య వనిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని ప్రొబేషనరీ ఎస్సై నవీన్చంద్ర తెలిపారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.