మరికొన్ని రోజుల్లో శీతాకాలం ముగిసి వేసవికాలం రానున్నది. పుష్య మాసం ముగిసి మాఘ మాసం సమీపిస్తున్న తరుణం..మామిడి పూత వచ్చే సమయం.. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం అడ్కాస్పల్లి సమీపంలోని లింగమయ్య ఆలయానికి వెళ్లే దారిలో ఉన్న ఓ తోటలో మామడి చెట్టుకు పూత విరగకాసింది. దూరం నుంచి చూసే వారికి ఆకులు కూడా కనిపించడం లేదు. ఈ దారిగుండా వెళ్లేవారంతా ఆసక్తిగా తిలకిస్తున్నారు.