ఆర్మూర్: ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను గురువారం డీఐఈవో రఘురాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ విశ్వేశ్వర్కు డీఐఈవో పలు సూచనలు చేశారు. కాలేజీ ప్రాంగణంలోని తరగతి గదులను శుభ్రం చేయించి శానిటైజర్ చేయాలన్నారు.
పరిసరాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో కళాశాల లెక్చరర్లు స్వర్ణ, రవి, విజయలక్ష్మి, లక్ష్మి, చంద్రశేఖర్, రాజు, సుభాష్, చంద్రమోహన్, లక్ష్మణ్, భూపాల్ తదితరులు పాల్గొన్నారు.