గిరిజనులకు పెద్దపీట వేసిందీ, పోడు పట్టాలు ఇచ్చిందీ సీఎం కేసీఆరే. మీ భూములకు మిమ్మల్ని రాజుల్ని చేసిందీ కేసీఆరేనని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తెలిపారు. ఇన్నేండ్లలో గిరిజనుల కోసం ఆలోచించిన నాయకుడు కేసీఆర్ తప్ప ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది ఆలోచించాలని సూచించారు. గురువారం భీమ్గల్, మానాల తండాల్లో పర్యటించిన వేముల.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మానాలలో 762 మంది గిరిజన రైతులకు 1750 ఎకరాల పోడు పట్టాలు అందజేశారు. బీజేపీ, కాంగ్రెస్ మాటలు నమ్మితే మోసపోతామని మంత్రిహెచ్చరించారు.
– కమ్మర్పల్లి/భీమ్గల్, అక్టోబర్ 5
కమ్మర్పల్లి/భీమ్గల్, అక్టోబర్ 5 : నియోజకవర్గానికి చివరి గ్రామమైన మానాల అంటే తనకు సొంత గ్రామంతో సమానమని, ఇక్కడి తండా ప్రజల కల్మశం లేని ప్రేమ తనకు ఇష్టమమని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఈ రోజు మానాల గిరిజన ప్రజల 762 కుటుంబాలకు 1750 ఎకరాల పోడు పట్టాలు పంపిణీ చేసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. ఇక నుంచి మీ భూములకు మీరే రా రాజులు అని గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ ఒక్క కేసీఆర్తోనే సాధ్యమైందన్నారు. ఇది మరెవ్వరితోనూ సాధ్యపడదని మంత్రి స్పష్టం చేశారు. బాల్కొండ నియోజకవర్గం మానాల గ్రామం, తండాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవం, పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాల్లో గురువారం మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు, తండా వాసులు మంత్రికి ఘనస్వాగతం పలికారు.
మంత్రితో సేవాలాల్ మహరాజ్ పూజ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లంబాడాలు అంటే తనకు అత్యంత ఇష్టమన్నారు. వారు అబద్ధాలు ఆడరన్నారు. ఒక్క ఊరి కోసం వంద కోట్లకు పైగా అభివృద్ధి పనులు జరిగాయని, మానాల ప్రజలను అంతా తన కుటుంబ సభ్యులలాగే చూశానని చెప్పారు. పార్టీ ఎన్నడూ చూడలేని.. ఏ పని కోసం కూడా ఎప్పుడూ తిప్పించుకోలేదన్నారు. మీ జేబు నుంచి రూపాయి ఖర్చు కానివ్వలేదన్నారు. మానాల గ్రామంలో 11 కులాలకు సంఘ భవనాలకు తీజ్, సేవాలాల్ భవనాలు రూ.67 లక్షలు, రూ.60 లక్షలు ఇతర సంఘ భవనాలకు ఇచ్చామని మొత్తం ఒక్క గ్రామంలోనే రూ.1.27 కోట్ల సంఘ భవనాలకు నిధులు ఇచ్చామని చెప్పారు. 16 తండాలుంటే 4 గ్రామపంచాయతీలు అధికారులు ప్రపోజల్ చేస్తే గిరిజన ప్రజల అభీష్టం మేరకు తాను 8 గ్రామపంచాయతీలు చేయించానన్నారు
తీజ్ పండుగకు మహిళకు తీజ్ భవనాలు/సేవాలాల్ భవనం ఒక్క బాల్కొండ నియోజకవర్గంలోనే ఇచ్చాం. రాష్ట్రంలో ఇట్లా ఎక్కడా లేదన్నారు. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు వచ్చి అయోమయంలో పడేసే మాటలు చెబుతారని.. వారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మోసపు మాటలు నమ్మొద్దని కోరారు. మీ కండ్ల ముందు కనిపిస్తున్నదే వాస్తవమని.. అదే నమ్మాలన్నారు. గృహలక్ష్మి పథకం ఇప్పుడు కొంతమందికి.. వచ్చే సారి మిగిలిన వారికి ఇస్తామని, అర్హులై పెన్షన్లు రాని వారికి కూడా ఇస్తామని హామీనిచ్చారు. మీలో ఒక్కడిగా మీ స్వంత అభివృద్ధి కోసం కృషి చేశానన్నారు. గిరిజన ప్రజల చిరకాల కోరికలను సీఎం కేసీఆర్ దయతో నెరవేర్చానన్నారు. మానాలగ్రామ, తండాల ప్రజల ఆశీర్వాదం కేసీఆర్కు, తనకు ఎప్పుడూ ఉండాలని కోరారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామన్నారు. ఇక్కడ జరిగిన అభివృద్ధిపై
హనుమాన్ తండా గొర్రె గుండం రోడ్డు పనులకు రూ.1.12 కోట్లతో శంకుస్థాపన, మానాల రుద్రాంగి రోడ్డుపై తాతమ్మ బ్రిడ్జి నిర్మాణ పనులకు రూ.2.20 శంకుస్థాపన చేశారు. పలు కులసంఘ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసి, ప్రొసీడింగ్ కాపీలు అందజేశారు.
అనంతరం రూ.20లక్షలతో నూతనంగా నిర్మించిన దేగావత్ తండా గ్రామపంచాయతీ భవనాల ప్రారంభోత్సవం చేశారు. అనంతరం భీమ్గల్ పట్టణంలో రూ. 2.80 కోట్లతో నూతనంగా నిర్మించనున్న ఆర్అండ్బీ గెస్ట్హౌస్ నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతాసురేందర్, ఎంపీపీ చౌట్పల్లి రవి, జడ్పీటీసీ రవి, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మొయీజ్, కమ్మర్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గుణ్వీర్రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు దొన్కంటి నర్సయ్య, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.