గోవిందా… గోవిందా నామస్మరణతో వేంకటేశ్వరాలయాలు మార్మోగాయి. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని జిల్లాలోని వైష్ణవాలయాలన్నీ శనివారం భక్తులతో సందడిగా మారాయి. ఉదయం 4గంటల నుంచి ఆలయ అర్చకులు పూజలు చేసి ఉత్తరద్వారం ద్వారా దర్శనాలు కల్పించారు. మూడుకోట్ల దేవతల అనుగ్రహం, వైకుంఠ ప్రాప్తి కలిగించే ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తరద్వార దర్శనం విశేషమైందని ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జెండా బాలాజీ మందిరం, సుభాష్నగర్ రామాలయం, గంగస్థాన్ ఉత్తర తిరుపతి క్షేత్రం, బ్రహ్మపురి పెద్దరాంమందిరం, చక్రంగుడి, ఖిల్లా రఘునాథాలయం, న్యాల్కల్రోడ్ రామాలయం… తదితర ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనానికి భక్తులు బారులుతీరారు.