కామారెడ్డి, జూలై 29 : డిజిటల్ బ్యాకింగ్ సేవలను వినియోగించుకోవాలని కల్టెర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వికాసనగర్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నూతన శాఖను కలెక్టర్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ మైక్రో యూనిట్లకు రుణాల పంపిణీపై బ్యాంకర్లు దృష్టి సారించాలని సూచించారు.
వినియోగదారులకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలు అందించేందుకు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ముందుకు రావడం అభినందనీయమని కొనియాడారు. డిప్యూటీ జోనల్ మేనేజర్ జి.అనంత్ కుమార్ మాట్లాడుతూ వ్యవసాయం, రైతుసంక్షేమం గ్రామీణ అభివృద్ధి, ప్రభుత్వరంగాలకు బ్యాంకు సేవలు అందిస్తామన్నారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో బ్యాకింగ్ లావాదేవీలను కొనసాస్తున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎల్డీఎం చిందం రమేశ్, బ్యాంక్ మేనేజర్ జి.లక్ష్మీకాంతం, బ్యాంక్ అధికారులు, ఖాతాదారులు, సిబ్బంది పాల్గ్గొన్నారు.