ఖలీల్వాడి/విద్యానగర్, నవంబర్ 26: ప్రభుత్వ దవాఖానల్లో గర్భిణుల సౌకర్యార్థం కొత్తగా ఏర్పా టు చేసిన టిఫా స్కానింగ్ మిషన్ల(గర్భిణిల్లో శిశువు ఎదుగుదల పరిణామక్రమం గుర్తించే యంత్రం)ను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు శనివారం ప్రారంభించారు. ఇందులో భాగంగా నిజామాబాద్, కామారెడ్డి ప్రభుత్వ దవాఖానల్లో ఏర్పాటు చేసిన స్కానింగ్ మిషన్లను స్థానిక ప్రజాప్రతినిధులు ప్రారంభించగా.. బాన్సువాడ దవాఖానలో ఏర్పాటు చేసిన స్కానింగ్ మిషన్ను సభాపతి పోచారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ..46 సెంటర్లలో దాదాపు రూ.20 కోట్ల వ్యయంతో టిఫా స్కానింగ్ మిషన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి 100 మందిలో ఏడు శాతం మంది శిశువుల్లో లోపాలను గుర్తించడానికి వీటిని ఉపయోగిస్తారని వివరించారు. నిజామాబాద్ జిల్లా దవాఖానలో టిఫా స్కానింగ్ మిషన్ను నగర మేయర్ నీతూ కిరణ్ ప్రారంభించగా.. సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమారాజ్, డాక్టర్ ఇందిర, వైద్యకళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నీలిమాసింగ్, గైనకాలజి విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్, రేడియోలజీ విభాగాధిపతి, ఇతర వైద్యులు, నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి ఏరియా దవాఖానలో..
కామారెడ్డి ప్రభుత్వ ఏరియా దవాఖానలో ఏర్పాటు చేసిన టిఫా స్కానింగ్ మిషన్ను స్థానిక ఎంపీపీ పిప్పిరి ఆంజనేయులు ప్రారంభించగా.. డీఎంహెచ్వో లక్ష్మణ్ సింగ్, ఏరియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి,ఆర్ఎంవో డాక్టర్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
బాన్సువాడలో ప్రారంభించిన సభాపతి పోచారం
బాన్సువాడ, నవంబర్ 26: బాన్సువాడలోని మాతా శిశు దవాఖానలో రూ. 30 లక్షలతో ఏర్పా టు చేసిన టిఫా స్కానింగ్ యంత్రాన్ని స్పీకర్ పో చారం శ్రీనివాసరెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టిఫా స్కానింగ్ మిషన్ గర్భంలోని శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. బాన్సువాడ మాతాశిశు దవాఖానలో ఆధునిక వైద్య పరికరాలు ఉండడంతో ప్రతినెలా 350 ప్రసవాలు జరుగుతున్నాయని, ఇందులో సుమారు 60 శాతం సుఖ ప్రసవాలు అని వివరించారు. గర్భి ణులను దవాఖానకు తీసుకురావడానికి అమ్మ ఒడి వాహనం (102) అందుబాటులో ఉందన్నారు. డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మణ్సింగ్,దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్, వైద్యులు సుధా చక్రవర్తి, దివ్య, మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, వైస్ చైర్మన్ షేక్ జుబేర్ పాల్గొన్నారు.