నిజామాబాద్ క్రైం, ఫిబ్రవరి 24: ఫోర్జరీ పత్రాలతో ఓపెన్ ప్లాట్ను విక్రయించిన ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వన్ టౌన్ ఎస్హెచ్వో విజయ్బాబు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని మాలపల్లికి చెందిన హలీమా బేగం విదేశాల్లో ఉంటున్నది. ఆమెకు చెందిన 400 గజాల ఓపెన్ ప్లాట్ నంబర్-07పై కొందరు వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించారు.
మహ్మద్ అబ్దుల్ ముఖీత్, ముజాహిద్ ఉద్దీన్ సిద్ధీఖ్, అహ్మద్ నబీ(డాక్యుమెంట్ రైటర్), ఇమ్రాన్, రయేసా హుస్సేన్తో పాటు మరికొందరు నకిలీ ఆధార్ కార్డు తయారు చేసి 2022 ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో గత ఏడాది ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఏడాది నుంచి పరారీలో ఉన్న రయేసా హుస్సేన్, ఇమ్రాన్ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్హెచ్వో తెలిపారు.