నిజామాబాద్ : ఎల్లమ్మ తల్లిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల జిల్లా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగా జిల్లాలోని భీమ్గల్లో ఎంపీ వ్యాఖ్యలకు నిరసనగా పెదంగంటి ఎల్లమ్మ దేవాలయంలో టీఆర్ఎస్ నాయకులు ఎల్లమ్మ విగ్రహానికి పూజలు నిర్వహించి పాలాభిషేకం చేశారు.
హిందువు అని చెప్పుకొనే ఎంపీ అరవింద్ హిందు దేవుళ్ల పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే ఎల్లమ్మ తల్లికి, హిందూ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే ఎంపీని గ్రామాల్లో తిరుగనివ్వమని హెచ్చరించారు.