నవీపేట : మండలంలోని జన్నేపల్లి గెస్ట్హౌస్ లో శనివారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంత్రావును నవీపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మువ్వ నాగేశ్వర్రావు, నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే అత్తగారు ఊరు మండలంలోని జన్నేపల్లి కావడంతో గత కొన్నేండ్లుగా దసరా నవరాత్రులను పురస్కరించుకుని ఇక్కడికి వచ్చి దుర్గమాతకు ప్రత్యేక పూజలు చేస్తు పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యే హన్మంత్రావును కలిసిన వారిలో టీఆర్ఎస్ జిల్లా నాయకులు వి.మోహన్రెడ్డి, బిడి దాస్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీన్కుమార్, సీనియర్ నాయకులు తెడ్డు పోశెట్టి, కే.సాయిబాబాగౌడ్, రచ్చ సుదర్శన్, శైలేశ్కుమార్, బల్లిరాజు తదితరులు ఉన్నారు.