బీర్కూర్లోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆరు రోజులుగా కొనసాగుతున్న శ్రీలక్ష్మీగోదా సమేత శ్రీవేంకటేశ్వర స్వామి నవమ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు మంగళవారం సంపూర్ణమయ్యాయి. ఈ సందర్భంగా వేదపండితులు స్వామివారికి మహా పూర్ణాహుతి, పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త, మాజీ స్పీకర్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస రెడ్డి దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.