కోటగిరి/ ధర్పల్లి/ డిచ్పల్లి, డిసెంబర్ 3 : ఓటు హక్కు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని తహసీల్దార్ శ్రీకాంత్రావు అన్నారు. ఓటు హక్కు నమోదు స్పెషల్డ్రైవ్లో భాగంగా మండలంలోని కొత్తపల్లి, దేవునిగుట్టతండా, కోటగిరిలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన శనివారం పరిశీలించారు. ఎత్తొండలో కేంద్రాలను ఎంపీడీవో మారుతి పరిశీలించారు. 18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వారి వెంట బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.
ధర్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో పోలింగ్కేంద్రాలను తహసీల్దార్ గంగాసాగర్ తనిఖీ చేశారు. పంచాయతీ కార్యదర్శులు, బీఎల్వోలు చేపడుతున్న ఓటు హక్కు నమోదు కార్యక్రమాన్ని పరిశీలించి వారికి పలు సూచనలు చేశారు. నేడు (ఆదివారం) ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు కోసం బీఎల్వో కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని డిచ్పల్లి తహశీల్దార్ శ్రీనివాస్రావు సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు సుద్దపల్లి, యానంపల్లిలో బీఎల్వో కేంద్రాలను తనిఖీ చేసి వివరాలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో సర్పంచులు గోపు చిన్నూబాయి, పానుగంటి రూపా సతీశ్రెడ్డి పాల్గొన్నారు.