Pothangal | పోతంగల్ మార్చి16 : పీహెచ్సీ ఆవరణ లోని పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మండల ప్రత్యేక అధికారి మున్నీ నాయక్ సూచించారు. పోతంగల్ మండల కేంద్రంలోని పీహెచ్సీని మండల ప్రత్యేక అధికారి, ఆర్డబ్ల్యూఎస్ డీఈ మున్నీ నాయక్ ఆకస్మికంగా సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన హాజరు పట్టికను పరిశీలించి, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు ఆసుపత్రిలోని పారిశుధ్య పరిస్థితులపై ఆరా తీశారు.
ప్రతీ ఒక్కరూ తప్పకుండా సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. రోగులతో మాట్లాడి వైద్య సేవలపై ఆరా తీశారు. నిరంతరం వైద్యసేవలు అందుతున్నాయని రోగులు చెప్పడంతో ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. పీహెచ్సీ వెనుక భాగంలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రంగా చేయించాలని కార్యదర్శి యాదవ్ సూచించారు. ఆయన వెంట గ్రామ సర్పంచ్ కల్లూరి సంధ్య హన్మండ్లు, ఎమ్మార్వో రంజిత్, ఎంపీడీవో చందర్, మెడి మెడికల్ ఆఫీసర్ అలీముద్దీన్, హెల్త్ సూపర్వైజర్లు సుజాత, సావిత్రి తదితరులు ఉన్నారు.