కోటగిరి, ఫిబ్రవరి 8 : ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మన ఊరు – మన బడితో పాటు, ఇతర అభివృద్ధి పనులు వేగవంతంగా చేపట్టి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని ఎంపీపీ వల్లెపల్లి సునీతా శ్రీనివాస్ అన్నారు. మండల ప్రజా పరిషత్ సమావేశపు మందిరంలో ఉపాధ్యాయులు, కాంట్రాక్టర్లు, పంచాయతీ కార్యదర్శులతో బుధవారం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండలంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా 17 పాఠశాలలు ఎంపికయ్యాయని, పనులు చివరి దశలో ఉన్నాయని తెలిపారు. వారంలోపు మిగిలిన పనులను కూడా పూర్తిచేయించాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీ మర్కెల్ గంగాధర్పటేల్, డీఈ అంజిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి రమేశ్, ఎంపీవో మారుతి, ఎంఈవో నాగ్నాథ్, వివిధ గ్రామాల సర్పంచులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.