వినాయక్నగర్, జనవరి 26: గణతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వేడుకలకు హాజరైన ప్రతిఒక్కరినీ మెటల్ డిటెక్టర్తో తనిఖీ చేసిన తర్వాతే గ్రౌండ్లోకి అనుమతించారు. గ్రౌండ్ పరిసర ప్రాంతాలను డాగ్ స్కాడ్, బాంబ్ స్కాడ్ బృందాలు తనిఖీ చేశాయి. పోలీసుశాఖలో విధి నిర్వహణలో ఉత్తమ, అత్యుత్తమ సేవలు అందించిన సిబ్బందికి కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంత్, సీపీ కల్మేశ్వర్ చేతుల మీదుగా అత్యుత్తమ సేవా పతకాలు, సేవా పతకాలు, ప్రశంసాపత్రాలను అందజేసి అభినందించారు. మొత్తం 178 మంది పతకాలను అందుకున్నారు.
వేడుకల అనంతరం పోలీస్పరేడ్ గ్రౌండ్లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆయుధాల ప్రదర్శన నిర్వహించారు. వివిధ రకాల గన్లు, వాటి వివరాలను ప్రదర్శించగా.. కలెక్టర్, సీపీ, అదనపు డీసీపీలు, సిబ్బంది పరిశీలించారు. ఆయుధాల రకాలు, వాటి పనితీరును కలెక్టర్కు సిబ్బంది వివరించారు.
కంఠేశ్వర్, జనవరి 26 : గణతంత్ర దినోత్సవంలో భాగంగా నగరంలోని సుభాష్నగర్లో ఉన్న బాలసదన్లో చిన్నారులకు కలెక్టర్, సీపీ పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ జయరాం, ట్రైనీ ఐపీఎస్ చైతన్య, డీడబ్ల్యూవో రసూల్బీ, కలెక్టరేట్ ఏవో ప్రశాంత్, బాలకిషన్, పర్యవేక్షకురాలు వినోద తదితరులు పాల్గొన్నారు.