మోర్తాడ్, మార్చి7: మోర్తాడ్ మండల కేంద్ర శివారులో బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టవద్దని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మోర్తాడ్లో గురువారం రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గతంలో రైల్వేలైన్, వరద కాలువ కోసం తాము భూములను కోల్పోయామని తెలిపారు. మళ్లీ ఇప్పుడు జాతీయరహదారి విస్తరణలో భాగంగా బైపాస్రోడ్డు నిర్మాణం చేపడితే మరిన్ని భూములను కోల్పోవాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
రైతుల ధర్నా విషయం తెలుసుకున్న తహసీల్దార్ సత్యనారాయణ, ఎస్సై అనిల్రెడ్డి అక్కడికి చేరుకొన్నారు. బైపాస్ రోడ్డు నిర్మాణం విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు.